సిలువ నేర్పే పాఠం – ‘కీడుకు ఎదురాడకుము’
ప్రభువు పరిచర్య కాలంలోగాని, ఆయన అప్పగింపబడిన తరువాత మహాసభ వద్ద విచారణ, రోమా ప్రభుత్వ విచారణ, ఆపై మరణ శిక్ష విధింపబడి సిలువపై వ్రేలాడి మరణించినప్పటి వరకు ఆయన బోధించి, అనుసరించిన విధానం ఒక్కటే. ‘దుష్టుని ఎదిరింపకుము’ లేక ‘కీడుకు ఎదురాడకుము’ (1881 తెలుగు బైబిలు) Resist not evil.
ప్రభువు ఐచ్చికంగా శ్రమలను సహించాడు. దావీదు మహారాజు, యెషయామరియు యెందరో ప్రవక్తల ద్వారా ప్రభువుకు యెదురయ్యే శ్రమలుమరియు ఆయన ప్రవర్తించబోవు తీరును గూర్చి అనేకమైన ప్రవచనాలు బైబిలు గ్రంథంలో వ్రాయబడ్డాయి. వ్రాయబడిన వాటి సారాంశం అన్నట్లుగా ప్రవక్తయైన యెషయా ప్రవచనాన్ని చూడవచ్చు.
‘అతడు దౌర్జన్యము నొందెను. బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వధకు తేబడు గొర్రెపిల్లయు, బొచ్చు కత్తిరించువాని యెదుట గొర్రెయు, మౌనముగా నుండునట్లు, అతడు నోరు తెరువలేదు. (యెష 53:7)
ప్రభువు స్వచ్చందంగా శ్రమలను సహిస్తాడన్న ప్రవచనాల నెరవేర్పు అన్నట్లుగా అపొస్తలుల సాక్ష్యం క్రొత్త నిబంధనలో యిలాగు వ్రాయబడింది. ‘ఆయన గొర్రెవలె, వధకు తేబడెను. బొచ్చు కత్తిరించువాని యెదుట, గొర్రెపిల్ల ఏలాగు మౌనముగా ఉండునో, ఆలాగే, ఆయన నోరు తెరవకుండెను.’ (అ కా 8:32)
క్రీస్తు సంఘానికి బండ అని చెప్పబడిన ఆపో. పేతురు మాటలలో: ‘ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడ, మీ కొరకు బాధపడి, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు, మీకు మాదిరి యుంచిపోయెను. ఆయన పాపము చేయలేదు. ఆయన నోటను, ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు, బదులు దూషింపలేదు. ఆయన శ్రమపెట్టబడియు, బెదిరింపక, న్యాయముగా తీర్పుతీర్చు దేవునికి, తన్ను తాను అప్పగించుకొనెను.’ (1 పేతు 2:21-23)
ప్రభువు సహనంమరియు ఓర్పులకు మూలం ఒక్కటే! ‘దుష్టుని ఎదిరింపకుము!’ లేక ‘కీడుకు ఎదురాడకుము!’
‘కీడుకు ఎదురాడకుము!’ అని ప్రభువు పలికిన మాటలో గొప్ప మర్మం దాగియుంది. అది నిత్య రాజ్యానికి ఖచ్చితంగా చేరుకునే మార్గానికి సూచిక వంటిది. అపవాది ఉచ్చులలో చిక్కుబడిపోకుండా అది కాపాడుతుంది. యిరుకు దారిలోనే ప్రయాణం చేసేలా సహాయం చేస్తుంది. విశాల మార్గం వైపుకు తిరుగకుండా నిలువరిస్తుంది. ‘క్షణభంగురమైన జీవితం’ ‘బుడగ ప్రాయమైన జీవితం’ బ్రష్టత్వంలోకి జారిపోకుండా కాపాడుతుంది. శరీరమనే గుడారంలో నివసించే దేవుని ఆత్మ స్వరూపులైన మానవులు నిత్య నాశనంలోనికి దిగిపోకుండా సహాయం చేస్తుంది. నాశనానికి కారకుడైన అపవాది మధ్యలో పుట్టి మధ్యలో పోయేవాడే. తిరుగుబాటు చేసిన అపవాదికి మనుష్యులను ప్రేరేపించగల శక్తి కలిగినందున, సాతాను కూడ తన ప్రభావాన్ని చూపుతుంది గాని, అది తాత్కాలికమే. అంతిమ విజయం దేవునిదే. సర్వలోకం సృష్టికర్తచే సృజింపబడింది. సృష్టి అలాగే సర్వ జీవుల కాలగతులు సృష్టికర్త స్వాధీనంలో ఉన్నాయి. దేవుని రాజ్యం నిత్యం నిలుస్తుంది.
‘యెహోవాయే నీ ప్రాణమునకును, నీ దీర్ఘాయుష్షుకును మూలమైయున్నాడు.’ (ద్వితీ 30:20) ‘ఆయన కాలములను, సమయములను, మార్చువాడైయుండి, రాజులను త్రోసివేయుచు, నియమించుచు, ఉన్నవాడు.’ (దాని 2:21) ఆయన యెహోవా దేవుడు, అనగా, నిత్యమైనవాడు, నిన్న నేడు రాబోవు కాలం ఉన్నవాడు. సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు, భూమ్యాకాశములు తన స్వాధీనంలో గల ఏలోహీమ్ (Elohim). జీవమరణములు దేవుని వశము. మరణం విషయంలో బైబిలు గ్రంథం చాలా స్పష్టంగా వివరించింది. ‘మరణము యొక్కయు, పాతాళ లోకము యొక్కయు, తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి.’ (ప్రక 1:18) ‘ఆత్మను విడవకుండా వుండుటకు తన ఆత్మ మీద మనుష్యుడు అధిపతి కాడు. మరణ దినము మీద వానికి అధికారమున్ను లేదు. ఆ యుద్ధమందు ఆయుధములను తీసివేసుట లేదు.’ (ప్రసం 8:8 – 1881 తెలుగు బైబిలు) ‘ఆత్మను చంపనేరక, దేహమునే చంపువారికి భయపడకుడి గాని, ఆత్మను, దేహమును కూడ నరకములో నశింపజేయగల వానికి, మిక్కిలి భయపడుడి.’ (మత్త 10:28) ‘మీ తండ్రి సెలవు లేక, వాటిలో (రెండు పిచ్చుకలలో) ఒకటైనను నేలను పడదు. … గనుక మీరు భయపడకుడి. మీరనేకమైన పిచ్చుకలకంటె శ్రేష్ఠులు. (మత్త 10:29,31)
ఈ వాక్యాలన్నిటిని ఋజువు చేస్తూ నీతిమంతుడైన యోబు విషయంలో దేవుడు అపవాదితో యిలాగు పలికాడు: ‘ఇదిగో అతనికి కలిగిన సమస్తమును నీ వశమున ఉన్నది. … అతడు నీ వశమున నున్నాడు. అతని ప్రాణము మాత్రము నీవు ముట్టవద్దు.’ (యోబు 1:12; 2:6)
పై వాక్యాలను గమనించినప్పుడు దేవుని సెలవు లేనిదే నరుల జననం కాని మరణం గాని జరుగలేవు. సిలువపై ప్రభువు మరణించినప్పుడు ఆయనను ఎవరూ చంపలేదని, స్వచ్చందంగానే ఆయన తన ప్రాణం పెట్టాడని ప్రభువు స్వయంగా ప్రకటించాడు.
‘ఎవడును నా ప్రాణము తీసికొనడు. నా అంతట నేనే దాని పెట్టుచున్నాను. దాని పెట్టుటకు నాకు అధికారము కలదు. దాని తిరిగి తీసికొనుటకును, నాకు అధికారము కలదు.’ నా తండ్రి వలన ఈ ఆజ్ఞ పొందితిని.’ (యోహా 10:18) అది ఒక్క దేవునికే సాధ్యం. ప్రభువు పిలాతుతో చెప్పిన మాట అదే. ‘పైనుండి నీకు ఇయ్యబడి యుంటేనే తప్ప, నా మీద నీకు ఏ అధికారమును ఉండదు.’ (యోహా 19:11)
వీటన్నిటిని బట్టి ఒక సంగతి గ్రహించవచ్చు. లోకంలో నరులు శ్రమలపాలైనా, అపవాది తంత్రాలకు నరుల జీవితాలు ఛిద్రమైనప్పటికీ, లోకయాత్ర ముగింపు సమయంలో ‘ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరల పోవును.’ (ప్రసం 12:7) ‘నా కాలగతులు నీ వశములో నున్నవి.’ (కీర్త 31:15) ‘తండ్రీ నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను’ (లూకా 23:46;) ‘యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుము’ (అ కా 7:59) అని ప్రతి జీవి చెప్పాల్సిందే. సమస్త శరీరాత్మల మనుగడ దేవునిలోనే. అపవాదికి మరణంపై అధికారం లేదు. ఈ కారణం చేతనే లోకంలో జీవిస్తున్న వారికి ప్రభువు ప్రకటించాడు. ‘లోకములో మీకు శ్రమ కలుగును. అయినను ధైర్యము తెచ్చుకొనుడి. నేను లోకమును జయించి యున్నాను.’ (యోహా 16:33) ‘క్రీస్తు, మీరు తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు, మీకు మాదిరి యుంచి పోయెను.’ (1 పేతు 2:21) ఆ మాదిరి ఏదనగా, ‘దుష్టుని ఎదిరింపకుము’ లేక ‘కీడుకు ఎదురాడకుము’
‘లోకములో మీకు శ్రమ కలుగును’ అని ప్రభువు పలికినట్లుగా లోకంలో ప్రభువుకు శ్రమలు వచ్చాయి. శ్రమల సమయంలో ఆయన తండ్రికి ప్రార్ధన చేశాడు. ‘నా తండ్రీ, సాధ్యమైతే ఈ గిన్నె నాయొద్ద నుండి తొలగి పోనిమ్ము. అయినను, నా యిష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము’ (మత్త 26:39) ‘నాయనా తండ్రీ, నీకు సమస్తము సాధ్యము. ఈ గిన్నె నాయొద్దనుండి తొలగించుము. అయినను, నా యిష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము’ (మార్కు 14:36) ‘తండ్రీ, యీ గిన్నెనాయొద్దనుండి (తొలగించుటకు) నీ చితమైతే తొలగించుము. అయినను నా యిష్టముకాదు, నీ చిత్తమే సిద్ధించునుగాక.’ (లూకా 22:43)
ఆలాగున ప్రార్ధించిన ప్రభువుకు ముమ్మారు ప్రార్ధించిన ఆపో. పౌలువలె, జవాబు వచ్చింది. ‘నా కృప నీకు చాలును’ (2 కొరిం 12:9) ‘అప్పుడు పరలోకమునుండి, యొక దూత ఆయనకు కనబడి, ఆయనను బలపరచెను.’ (లూకా 22:44) ఆ తరువాత దేవుని చిత్తాన్నెరిగిన ప్రభువు యిలాగు ధైర్యంగా పలికాడు: ‘తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా’ (యోహా 18:11)
విచారణమరియు సిలువ వేయబడిన సమయంలో ప్రభువు కీడును కీడుతో ఎదిరించకుండా, కీడును ధైర్యంగా సత్యముతో ఎదుర్కొని విజయుడయ్యాడు. ఆయన విజయం ఆ క్షణమే ప్రకటించబడింది. ప్రభువుకు శిక్ష విధించిన పిలాతు యిలాగు పలికాడు. ‘ఈ నీతిమంతుని రక్తమును గూర్చి నేను నిరపరాధిని. (మత్త 27:24) శిక్ష అమలు చేసినప్పుడు జరిగినది చూచిన శతాధిపతి ప్రకటించాడు: ‘ఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి, దేవుని మహిమపరచెను.’ (లూకా 23:47) ‘శతాధిపతియు, అతనితో కూడ, యేసునకు కావలి యున్నవారును, … నిజముగా, ఈయన దేవుని కుమారుడని చెప్పుకొనిరి.’ (మత్త 27:54) ‘ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి, ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి, నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే, అని చెప్పెను.’ (మార్కు 15:39)
శ్రమ పడటం దేవుని చిత్తమైనప్పుడు, శ్రమలలో విశ్వాసిదే విజయం. ‘ధర్మము నాచరించువారికి కీడేమియు సంభవింపదు. సమయము వచ్చుననియు, న్యాయము జరుగుననియు, జ్ఞానులు మనస్సున తెలిసికొందురు.’ (ప్రసం 8:5) శ్రమలు కలిగినప్పుడు, దేవునికి యెడతెగక ప్రార్ధించడం మొదటి చర్య. ఆ ప్రార్ధన ఎలా చేయాలో ప్రభువు నేర్పించాడు. ‘మమ్మును శోధనలోకి తేక, దుష్టునినుండి (కీడునుండి) మమ్మును తప్పించుము.’ (మత్త 6:13) ప్రార్ధించినప్పటికీ, శోధన కొనసాగినట్లయితే, శోధనలను సహించడాని శక్తి నిమిత్తం ప్రార్ధించడం రెండవ చర్య. ఆ తరువాత, ‘తన అడుగుజాడలయందు నడుచుకొనునట్లు, మీకు మాదిరి యుంచిపోయిన’ యేసును అనుసరించి, శ్రమల లోయలో ప్రయాణించడం విశ్వాసియొక్క మూడవ చర్య. ‘గాఢాంధకారపు (మరణాంధకారపు) లోయలో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైయుందువు. నీ దుడ్డు కఱ్ఱయు, నీ దండమును, నన్ను ఆదరించును.’ (కీర్త 23:4) [దుడ్డు కఱ్ఱ: Rod, హెబ్రీ: షెబెత్, సరిదిద్దుటకు లేక పాలించుటకు, దండము: staff, హెబ్రీ: మిష్హాన్, ఆనుకొనుటకు] ‘ఇదిగో, నేను యుగ సమాప్తి వరకు, సదాకాలము మీతో కూడ ఉన్నాను’ (మత్త 28:20) దేవుని సన్నిధిలో జీవించేవారికి ప్రభువు తన మార్గాన్ని బోధించాడు:
‘నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపక, నిన్ను కుడిచెంప మీద కొట్టువాని వైపునకు ఎడమచెంప కూడ త్రిప్పుము.’ (మత్త 5:39) ‘కీడుకు ప్రతి కీడెవనికిని చేయవద్దు’ (రోమీ 12:17) ‘కీడుకు ప్రతికీడు చేసెదననుకొనవద్దు. యెహోవాకొరకు కనిపెట్టుకొనుము, ఆయన నిన్ను రక్షించును.’ (సామె 20:22) ‘ఇదిగో మీరు శోధింపబడునట్లు, అపవాది (అనగా సాతాను) మీలో కొందరిని చెరలో వేయింపబోవుచున్నాడు. పది దినములు శ్రమ కలుగును. మరణమువరకు (అనగా ప్రాణాపాయము వచ్చినను) నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటమిచ్చెదను. (ప్రక 2:10)
సిలువ నేర్పే పాఠం యిదే! ‘కీడుకు ఎదురాడకుము’ నేను విజయం సాధించి మీకు మాదిరి చూపించాను అని ప్రభువు ప్రకటించాడు. ‘శిష్యుడు తన బోధకునివలెను, దాసుడు తన యజమానునివలెను, ఉండిన చాలును. (మత్త 10:25) ‘నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము, మీరును నన్ను పోలి నడుచుకొనుడి.’ (1 కొరిం 11:1) అని ఆపో. పౌలు పలికాడు.
ప్రభువు సిలువ నేటికీ అదే బోధిస్తున్నది. ‘లోకములో మీకు శ్రమ కలుగును’ ‘కీడుకు ఎదురాడకుము!’ అయితే, విశ్వాసులకు అనుమానం కలిగేలాగా పరి. యాకోబు వ్రాసిన పత్రికలో యిలాగు వ్రాయబడింది.
‘అపవాదిని (సాతానును) ఎదిరించుడి’ (యాకో 4:7) రెండు హెచ్చరికలు భిన్నంగాను ఒక దానికి ఒకటి విరుద్ధంగాను కనబడతాయి. అయితే, రెండు విధాలు కూడ సరియైనవే. క్రీస్తు ప్రభువు చెప్పింది కూడ అదే. ‘దుష్టుని (అపవాదిని) దుష్టత్వంతో ఎదిరింపక ‘ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు (దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొని’ (ఎఫె 6:13) అపవాదిని (సాతానును) ఎదిరించండి’.
‘మీ నడుమునకు సత్యమను దట్టి కట్టుకొని, నీతియను మైమరువు తొడుగుకొని, పాదములకు సమాధాన సువార్త వలననైన సిద్ధమనస్సను జోడు తొడుగుకొని, నిలువబడుడి. ఇవన్నియు గాక, విశ్వాసమను డాలు పట్టుకొనుడి. దానితో, మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటిని ఆర్పుటకు శక్తిమంతులవుదురు.మరియు రక్షణయను శిరస్త్రాణమును, దేవుని వాక్యమను ఆత్మఖడ్గమును ధరించుకొనుడి. ఆత్మవలన, ప్రతి సమయమునందును, ప్రతి విధమైన ప్రార్థనను, విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై, సమస్త పరిశుద్ధుల నిమిత్తమును, పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు, మెలకువగా ఉండుడి.’ (ఎఫె 6:14-18)
యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో జీవించిన కాలంలో పిరికితనంతో లేదా భయపడుతూ ఆయన జీవించ లేదు. వాక్యమనే ఖడ్గాన్ని ఉపయోగించి సాతాను నోరు మూయించాడు. వాస్తవానికి వాక్యమంటే ఆయనే.
‘ఆదియందు వాక్యముండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై యుండెను. ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్య సంపూర్ణుడుగా, మనమధ్య నివసించెను.’ (యోహా 1:1,14) ‘ఆయన నామము దేవుని వాక్యమనబడియున్నది.’ (His name is called The Word of God.) (ప్రక 19:13) అందుకే దేవుని వాక్యము, యెహోవా వాక్యము అనబడిన కుమారుడైయున్న దేవుని దావీదు కీర్తించాడు. ‘దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను. యెహోవానుబట్టి ఆయన వాక్యమును కీర్తించెదను.’ (కీర్త 56:10)
‘తన వాగ్దండము చేత లోకమును కొట్టును.’ (యెష 11:4) అని యెషయా ప్రవక్త ప్రవచించిన రీతిగా, నరావతారియైన దేవుని వాక్యం తన మాటలతో అందరి నోర్లు మూయించడమే కాదు. అట్టి వాక్యమైయున్న ప్రభువు శాస్త్రులకు పరిసయ్యులకు, ప్రధాన యాజకులకు, ప్రజలకు, చివరికి వ్యాపారం చేసేవారికి ఎప్పుడూ భయపడలేదు. సందర్భాన్ని బట్టి లేఖన భాగాలను వారికి గుర్తుచేసి, వాక్యంతో శాస్త్రులకు పరిసయ్యులకు జవాబు చెప్పాడు. వారి లోపాలను ఎత్తి చూపాడు. వారు ఆయనను కొట్టడానికి లేదా చంపడానికి ప్రయత్నించి నప్పుడు మాత్రం తనను బట్టి వారు పాపం మూటగట్టుకోకుండా, ఆయన ఆ ప్రాంతం నుండి తప్పుకొని వెళ్ళిపోయాడు. ప్రధాన యాజకులుమరియు ప్రజలందరి సమక్షంలోనే దేవాలయంలో వ్యాపారం చేసేవారి బల్లలు పడద్రోసి, వారిని తరిమివేశాడు.
గలిలయ ప్రాంతంలో యేసు ప్రభువు పరిచర్య చేస్తున్న సమయంలో ఆయన యొద్దకు పరిసయ్యులు వచ్చి, హేరోదు (యోహానును చెరలో వేసి, తలగొట్టించిన హేరోదు రాజు) నిన్ను చంపాలని అనుకొంటున్నాడు, నువ్వు పారిపో అని చెప్పారు. వారి ఆలోచన హేరోదునుండి ఆయనను రక్షించాలని కాదు. గలిలయనుండి యెరూషలేముకు ఆయన వెళితే, ఆయనను వారే అక్కడ చంపవచ్చునని. వారి ఆంతర్యం ఎరిగిన క్రీస్తు ప్రభువు అటు హేరోదు అలాగే పరిసయ్యుల నక్క వేషాలు బయటపెట్టే విధంగా మాట్లాడాడు. (గ్రీకు భాషలో ఆడు నక్కనే నక్క అని పిలుస్తారు. నక్క చాలా హేళనైన మాట. పిరికితనానికీ, జిత్తులమారితనానికీ, వంచనకు, తంత్రాలకు, తుంటరితనానికి, దుశ్చేష్టలకు మారు పేరు నక్క. ‘మీరు సింహానికి తోకగానైనా ఉండండి గాని నక్కలకు తలగా మాత్రం కాదు అనేది యూదులలో ఒక సామెత) యేసు ప్రభువు యిలాగు జవాబిచ్చాడు: ‘మీరు వెళ్లి, ఆ నక్కతో ఈలాగు చెప్పుడి. ఇదిగో నేడును రేపును నేను దయ్యములను వెళ్ల గొట్టుచు (రోగులను) స్వస్థపరచుచు నుండి మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను’ (లూకా 13:32) ఈ మాటలలో హేరోదు రాజంటే భయంలేదు. తాను నివసించిన గలిలయ ప్రాంతానికి అధిపతిగా ఉన్న హేరోదు రాజును ‘ఆ నక్కతో ఈలాగు చెప్పుడి’ అని బహిరంగంగా అందరూ వింటుండగా మాట్లాడాడు. హేరోదు రాజు పాలనా ప్రాంతమైన గలిలయలో యింకా రెండు రోజులు ఉండి, నా పని కొనసాగిస్తాను. నన్ను అతడు భయపెట్టలేడు, ఆటంకపరచలేడు. నా యిష్ట ప్రకారం, నా ప్రణాళిక ప్రకారమే నేను కొనసాగిస్తానని ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు గాని, పరిసయ్యుల చెవులు మందమైనవి గనుక వారు గ్రహింపలేదు.
సిలువవేయబడుటకు యేసు ప్రభువు అప్పగింపబడక ముందు, యూదా ప్రజల పక్షంగా ప్రధాన యాజకుని సమక్షంలో యేసు ప్రభువును రోమా గవర్నరు పిలాతు ప్రశ్నించినప్పుడు ‘ఆయన ఒక మాటకైనను అతనికి ఉత్తరమియ్యలేదు గనుక అధిపతి మిక్కిలి ఆశ్చర్యపడెను.’ (మత్త 27:14; మార్కు 15:5) ఒక తీర్పుతీర్చు అధికారి అడిగిన ప్రశ్నలకు జవాబు యివ్వకపోవడం ఖచ్చితంగా తిరుగుబాటే. దానికి లోకరీతిగా చాలా ధైర్యం కావాలి. ఆయన ప్రేమాస్వరూపి. ‘ప్రేమలో భయముండదు; అంతేకాదు; పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్లగొట్టును; భయము దండనతో కూడినది’ (1 యోహా 4:18)
యేసు ప్రభువు ధైర్యానికి మరొక ఉదాహరణ: ప్రధానయాజకుడు అడిగిన ప్రశ్నలకు యేసు ప్రభువు జవాబు చెప్పుచున్నప్పుడు దగ్గర నిలిచియున్న బంట్రౌతులలో ఒకడు ప్రధానయాజకునికి ఈలాగు ఉత్తరమిచ్చు చున్నావా అని చెప్పి, యేసును అరచేతులతో కొట్టాడు. అందుకు యేసు ప్రభువు, ‘నేను కాని మాట ఆడిన యెడల ఆ కాని మాట ఏదో చెప్పుము; మంచిమాట ఆడిన యెడల నన్నేల కొట్టుచున్నావు? అని బంట్రోతును నిలదీశాడు. (యోహా 18:22,23) ఆయన ఆ మాట పలికింది వాడు కొట్టిన దెబ్బల మూలంగా తన శరీరానికి కలిగిన బాధ వలన కానేకాదు. వాడు తన విధి ధర్మం పాటించనందుకు మాత్రమే.
ప్రభువు ఆచరించిన విధానం ‘సాత్వీకపు లేదా నిష్క్రియతో కూడిన విధేయత.’ (doctrine of passive obedience) అనగా ఆజ్ఞాపించబడిన పని ఎదిరించకుండా విధేయతతో చేయకపోవడం. చాలా మంది అనుకొంటున్నట్లుగా అట్టి విధేయత లోకంలోని దుష్టత్వానికి తలవంచి లోబడటం కాదు. అపవిత్రతకు పిరికివాని వలె లొంగిపోవడం కాదు, దుష్టత్వానికి భయపడి లోబడటం కాదు. ఆయా సందర్భాలలో ప్రభువు చేసింది, నిష్క్రియతోమరియు విధేయతతో లోబడే సిద్ధాంతం కాదు. అది సాత్వీకం లేదా నిష్క్రియతో ఎదిరించే సిద్ధాంతం. అది మానవజాతి నైతిక శాస్త్రానికి మొట్టమొదటి సారిగా క్రీస్తు ప్రభువు అందించిన క్రొత్త సిద్ధాంతం. క్రీస్తు ప్రభువు జీవితాన్ని బట్టి అందలి భావం స్పష్టంగా గ్రహించవచ్చు.
మనుష్యులకు తమ జీవిత కాలమంతటిలో ఏర్పడే శత్రువుల సంఖ్య కంటే తన స్వల్పమైన జీవిత కాలంలో యేసుక్రీస్తు ప్రభువుకు చాలా ఎక్కువ మంది శత్రువులుగా నున్నారు. ఆయనపై శత్రువుల ద్వేషం ఎంతగా పెరిగిపోయిందంటే, ఆయనను చంపివేయడం తప్ప మరి ఎట్టి కార్యమూ వారిని తృప్తిపరచలేదు. అయినా, తాను ఎంచుకొన్న మార్గం ఎంత ప్రమాదకరమైనదో యేసు ప్రభువుకు తెలుసు. వ్యతిరేకించే వారికి ఆయన లోబడినట్లయితే, అట్టి ప్రమాదాన్నుండి తప్పించుకోవచ్చు గాని, ఒక్కసారి కూడ ఆయన అలా లోబడలేదు. ఆయన జీవిత పర్యంతం అధికారులుమరియు పెద్దల వలన ఏర్పడిన పరిస్థితులపై లోబడిన జీవితం కాదు గాని తిరుగుబాటుగానే ఉండేది. సత్యాన్ని బట్టి ఆయన వ్యతిరేకత పరిచర్య ఆరంభ దినాల నుండి సిలువ మరణ పర్యంతం అలాగే నిలిచింది. ‘దుష్టుని ఎదిరింపకుము’ లేక కీడుకు ఎదురాడకుము’ అనగా ‘దుష్టుని దుష్టత్వంతో ఎదిరింపకుము’ ‘కీడును కీడుతో ఎదిరించవద్దు’ అనేది ప్రభువు పోరాట విధానం. బలప్రయోగంతో బల ప్రయోగాన్ని ఎదిరింపవద్దు. దూషణను దూషణతోను, నిందను నిందతోను ఎదుర్కోవద్దు. దుష్టత్వానికి లోనుకాకుండా చెడును మంచితో జయించి, దూషణను మంచి మాటలతోను, నిందను మౌనంతోను ఎదుర్కోవడం. యేసుక్రీస్తు ప్రభువు ఒక కత్తిని గాని ఈటెను గాని తనతో ఉంచుకోలేదు, శిరస్త్రాణం గాని కవచం గాని ధరించలేదు, కాళ్ళకు యిత్తడి తొడుగులు లేవు గాని వీటన్నిటిని మించిన రక్షణ ఆయుధాలను ఆయన ధరించాడు. మనుష్యుల మధ్య వివాదాలను పరిష్కరించగల ఆయుధం ఆయన ధరించాడు. నిజమైన విజయం సాధించ గలిగిన ఆ ఒకే ఒక్క పద్ధతిని ఆయన వినియోగించాడు. యూదుల మూర్ఖత్వాన్ని సహనంతో భరించాడు. రోమీయుల క్రూరత్వం యెదుట యూదుల మానవత్వ ప్రతినిధిగా ఆయన నిలబడ్డాడు. యూదుడైన ఆయన తనను అతిగా ద్వేషించిన యూదులుమరియు రోమీయుల సంఘటిత శక్తికి ఒంటరిగా ఎదురొడ్డాడు. రోమీయుల శక్తి ఆయనను ఏమీ చేయలేక పోయింది.
యేసుక్రీస్తు ప్రభువు దేహాన్ని సీజరు చంపగలిగాడు అని అనుకున్నప్పటికీ, ఆ పై ఆయనను యింకా ఏమీ చేయలేక పోయాడు. రోమీయులు ఆయనను చంపిన తరువాత, యేసు క్రీస్తు ప్రభువు మృత్యుంజయుడై రోమా సామ్రాజ్యపు పునాదులను కదిలించాడు. రోమా రాజ్య పరిపాలనా నిబంధనలనుమరియు చరిత్ర గతిని మార్చివేశాడు.
‘కీడుకు ఎదురాడకుము’ క్రీస్తు యేసు ప్రభువు చూపిన మాదిరిని బట్టి ఆది సంఘం యజమానుని పోలి నడుచుకుంది. వారు ఎవరినీ శత్రువుగా భావించలేదు. యూదుల వ్యతిరేకతకు వారు ఆత్మ సంయమం పాటించారు. వారు సైన్యానికి భయపడలేదు; రాజుల యెదుట ధైర్యంగా నిలబడ్డారు; హింసను లెక్కచెయ్యలేదు. శరీర బాధలకు మౌనసమ్మతి తెలిపారు. తమ విశ్వాస మార్గంలో తమను ఎదిరించువారిని నిందించక, ప్రభువు నిమిత్తం సంతోషంగా హత సాక్ష్యులయ్యారు. ఆలాగున మహిమ రాజ్యానికి వారసులయ్యారు.
చరిత్ర గమనించినట్లయితే, రోమీయుల అధికారంపై బలప్రయోగంతో కూడిన యూదుల ప్రతిఘటన మూలంగా లక్షలాది మంది యూదులు చనిపోయారు. లక్షలాది మంది యూదులు దౌర్భాగ్య స్థితిలోనికి నెట్టబడ్డారు. యూదులు రోమా పాలనను పోరాటం ద్వారా ప్రతిఘటింపగా, క్రైస్తవులు మౌనంగా సహనంతో ప్రతిఘటించారు. రోమీయుల క్రూరత్వం యూదులకంటే క్రైస్తవులకు మరి ఎక్కువ హేయమైనది. అయినా క్రైస్తవ విశ్వాసులు తమను ద్వేషించేవారిని చంపాలని అనుకోలేదు, వారిని మార్చాలనుకొన్నారు. ఆది సంఘంలోని క్రైస్తవులు రోమీయుల విధానాన్ని వ్యతిరేకించినప్పటికీ, వారిపై తిరిగి పోరాటం చేయలేదు. సత్యాన్ని గ్రహించి, క్రీస్తు ప్రభువును ఆరాధించాలని వారికి బోధించారు. తమ ఆగ్రహాన్ని క్రైస్తవులు మౌనంగా సహించడం రోమీయులు చూచి నప్పుడు, వారి ఆగ్రహం అభినందన, ప్రేమమరియు ఆరాధనగా మారింది. కాలక్రమంగా క్రైస్తవ మతం రోమా సామ్రాజ్య మతంగా అవతరించింది. రోమీయులతో క్రైస్తవుల వైరాన్ని బట్టి కలిగిన ప్రాణ నష్టం యూదులతో పోలిస్తే ఎక్కువ కాదు. కోజిబా (యూదులను సమీకరించి తిరుగుబాటు చేసినవాడు) తిరుగుబాటు వల్ల ఒక్క సంవత్సరంలో జరిగిన యూదుల ప్రాణ నష్టంతో పోలిస్తే, మూడు వందల సంవత్సరాలలో రోమీయులచే చిత్రహింసల వలన చనిపోయిన క్రైస్తవుల సంఖ్య చాలా తక్కువ. ఆయుధం మూలంగా చనిపోయిన ప్రతి యూదుడు మరి యెక్కువ శత్రువులను తయారుచేసుకొన్నాడు. నిరాయుధుడై చనిపోయిన ప్రతి క్రైస్తవ విశ్వాసి స్నేహితులను సంపాదించాడు. అందుకొరకే హతసాక్షులైన క్రైస్తవుల రక్తమే సంఘం మొలకెత్తుటకు విత్తనంగా మారిందనే ఉపమానం వచ్చింది. క్రీస్తు ప్రభువు చరిత్ర అలాగే క్రైస్తవ సంఘ ఆవిర్భావం, క్రీస్తు ప్రభువు బోధించిన విధానానికి సాక్ష్యంగా నిలిచింది.
‘ప్రభువు యొక్క మహాశక్తినిబట్టి ఆయనయందు బలవంతులై యుండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు (దేవుని) సర్వాంగ కవచమును ధరించుకొనుడి.’ (ఎఫె 6:10,11) ‘నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారైయుండక వాటిని ఖండించుడి.’ (ఎఫె 5:11) ‘సాతాను మనలను మోసపరచకుండునట్లు, .. వాని తంత్రములను మనము ఎరుగని వారము కాము.’ (2 కొరిం 2:11) ‘నిబ్బరమైన బుద్ధిగలవారై మెలకువగా ఉండుడి; మీ విరోధియైన అపవాది గర్జించు సింహమువలె ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరులయందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని యెరిగి, విశ్వాసమందు స్థిరులై వాని ఎదిరించుడి.’ (1పేతు 5:8,9) ‘దేవునిచేత ఏర్పరచబడిన వారిమీద నేరము మోపువాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే’ (రోమా 8:33)
ప్రభువు సిలువ సందేశం నేటికీ అదే! ‘లోకంలో మీకు శ్రమ కలుతాయి’ ‘కీడుకు ఎదురాడవద్దు!’
‘అపవాది తంత్రాలకు లోబడవద్దు!’ ‘నేను లోకాన్ని జయించాను’ ‘నీవును నేనిచ్చు సర్వాంగ కవచాన్ని ధరించి లోకాన్ని జయించు!’ ‘జీవ కిరీటం పొందుకో! ఆమేన్!
Telugu Bible in 5 min
ప్రతిరోజు కేవలం 5 నిముషాలు బైబిల్ చదువుకొని, ఒక సంవత్సరంలో బైబిల్ పూర్తిచేయవచ్చు!!!
BEST CHRISTIAN TELUGU BOOK – GARUKAINA SILUVA
గరుకైన శిలువ! పుస్తక పరిచయం:
‘ఆయన (యేసు క్రీస్తు ప్రభువు) అందరితో ఇట్లనెను. ఎవడైనను నన్ను వెంబడింప గోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, ప్రతి దినము తన సిలువను ఎత్తికొని, నన్ను వెంబడింపవలెను. (లూకా 9:23) ‘తన సిలువను ఎత్తికొని, నన్ను వెంబడింపనివాడు, నాకు పాత్రుడు కాడు.’ (మత్త 10:38) శ్రమలకు, వేదనలకు, కష్టాలకు మరియు శోధనలకు చిహ్నం శిలువ. క్రైస్తవ జీవితం పూల బాట కాదు. అది ముళ్ళ బాట. అయినా, క్రీస్తు ప్రభువులో జీవించేవారికి ఆ ముళ్ళే పువ్వులకు మించిన దేవుని శక్తిని, ఆత్మ సంతృప్తిని మరియు పరలోక నిత్యానందాన్ని కలిగిస్తాయి. కాని, అవి కేవలం విశ్వాసులకు వ్యక్తిగత అనుభవాలే.
‘సిలువను గూర్చిన వార్త, .. రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి.’ (1 కొరిం 1:18) ‘పాపాత్ములు తనకు వ్యతిరేకముగ (తమ స్వంత హానికే) చేసిన తిరస్కారమంతయు ఓర్చుకొనిన, ఆయనను తలంచుకొనుడి. (హెబ్రీ 12:,3) శిలువపై ప్రభువు పలికిన మాటలను అనునిత్యం విశ్వాసి స్మరణ చేసుకుంటూ తమ జీవితాలలో ఎదురయ్యే సమస్యలను, శోధనలను, యిరుకులను, యిబ్బందులను మనోధైర్యంతో అధిగమించు ఉద్దేశంతో ఈ పుస్తకం సిద్ధం చేయబడింది. ఈ కారణంగానే ఈ పుస్తకానికి గరుకైన శిలువ అని పేరుపెట్టబడింది.
శిలువపై ప్రభువు పలికిన ఏడు మాటలను ఒక కథలాగ చదవాలనుకొనే వారికి పుస్తకంలో వ్రాయబడిన కొన్ని రిఫరెన్సు వాక్యాలు లేక వివరాలు కొంత అవ్యవస్థగా అనిపించవచ్చు. ఒక వివరణతో కూడిన కథవలె కాకుండ, శిలువపై ప్రభువు పలికిన ఏడు మాటలను విశ్వాసులు తమ జీవితాలకు అన్వయించుకొనే విధంగా వివరణాత్మకమైన పద్ధతిలో ఈ పుస్తకం సిద్ధం చేయబడింది. పుస్తకం చదివే సమయంలో ఈ విషయం గమనించి దేవుని స్వరాన్ని విశ్వాసులు వినగలుగునట్లుగా మన ప్రభువైన యేసు క్రీస్తు సహాయం చేయును గాక! ఆమేన్!
విషయ సూచిక
ప్రభువు సిలువ పైవిలాసం
(రోమాయి, హెబ్రాయిమరియు గ్రీకు భాషలలో) … 7
సిలువపై ప్రభువు పలికిన ఏడు మాటలు
(తెలుగు, ఇంగ్లీషు, రోమాయిమరియు గ్రీకు భాషలలో) … 8
సిలువ నేర్పే పాఠం – కీడుకు ఎదురాడకుము … 10
సిలువ – విశ్వాసి అనుభవాలకు ప్రతీక … 20
సిలువపై యేసుక్రీస్తు ప్రభువు పలికిన ఏడు మాటలు – ఉపోద్ఘాతం … 37
V 1. మొదటి మాట – తండ్రీ, వీరేమిచేయుచున్నారో
వీరెరుగరు గనుక వీరిని క్షమించుము … 61
V 2. రెండవ మాట – నేడు నీవు నాతోకూడ పరదైసులో ఉందువు … 86
V 3. మూడవ మాట – అమ్మా, యిదిగో నీ కుమారుడు, .. యిదిగో నీ తల్లి … 118
V 4. నాల్గవ మాట – ఏలీ, ఏలీ, లామా సబక్తానీ … 130
V 5. ఐదవ మాట – దప్పిగొనుచున్నాను … 148
V 6. ఆరవ మాట – సమాప్తమైనది … 156
V 7. ఏడవ మాట – తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొను చున్నాను … 174
ముగింపు … 188
అనుబంధము 1 – పాత నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు ప్రభువును గూర్చిన ప్రవచనాలుమరియు వాటి నెరవేర్పు … 199
VIII. అనుబంధము 2 – సంగీతము: The Old Rugged Cross (సిలువ విలువ) … 223
XI. బైబిలు సంవత్సరం – సంవత్సర కాలంలో బైబిలు గ్రంథ పూర్తి
అధ్యయన ప్రాణాళిక … 227
Enni thalachina Song Lyrics Chords ఎన్ని తలచినా TAMIL
ఎన్ని తలచినా ఏది అడిగినా Ennithalachina Telugu Lyrics
ఎన్ని తలచినా ఏది అడిగినా
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
నీ వాక్కుకై వేచియుంటిని
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
నీ తోడు లేక నీ ప్రేమ లేక
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||
నా ఇంటి దీపం నీవే అని తెలసి
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||
ఆపదలు నన్ను వెన్నంటియున్నా
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
లోకమంతయూ నన్ను విడచినా (2)
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
ఎన్ని తలచినా ఏది అడిగినా Chords in Telugu
Dm C Dm
ఎన్ని తలచినా ఏది అడిగినా
C Dm
జరిగేది నీ చిత్తమే (2) ప్రభువా
Dm C Dm
నీ వాక్కుకై వేచియుంటిని
A# Dm
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా
Dm C Dm C
నీ తోడు లేక నీ ప్రేమ లేక
A# C Dm
ఇలలోన ఏ ప్రాణి నిలువలేదు (2)
C Dm
అడవి పూవులే నీ ప్రేమ పొందగా (2)
A# Dm
నా ప్రార్థన ఆలకించుమా (2) ప్రభువా ||ఎన్ని||
Dm C Dm C
నా ఇంటి దీపం నీవే అని తెలసి
A# C Dm
నా హృదయం నీ కొరకై పదిలపరచితి (2)
C Dm
ఆరిపోయిన నా వెలుగు దీపము (2)
A# D
వెలిగించుము నీ ప్రేమతో (2) ప్రభువా ||ఎన్ని||
Dm C Dm C
ఆపదలు నన్ను వెన్నంటియున్నా
A# C Dm
నా కాపరి నీవై నన్నాదుకొంటివి (2)
C Dm
లోకమంతయూ నన్ను విడచినా (2)
A# Dm
Dm C Dm C
నీ నుండి వేరు చెయ్యవు (2) ప్రభువా ||ఎన్ని||
A# C Dm
నా స్థితి గమనించి నన్నూ ప్రేమించి
C Dm
నా కొరకై కల్వరిలో యాగమైతివి (2)
C Dm
నీదు యాగమే నా మోక్ష మార్గము (2)
A# Dm
నీయందే నిత్యజీవము (2) ప్రభువా ||ఎన్ని||
என்னி Enni Thalachina Tamil Christian Song lyrics
என்னி தலச்சினா ஏதி அdigina
ஜரிகேதி நீ சித்தமே
பிரbuவா ஜரிகேதி நீ சித்தமே
நீ வாக்குகை வேச்சியுன்டினி
நா பிராத்தனா ஆலகின்ச்சுமா பிரbuவா
நா பிராத்தனா ஆலகின்ச்சுமா
MUSIC
நீ தோடு லேகா நீ பிரேம லேகா
இல லோனா ஏ பிராணி நிலுவலேது
INTERLODE
நீ தோடு லேகா நீ பிரேம லேகா
இல லோனா ஏ பிராணி நிலுவலேது
அடவி பூவுலே நீ பிரேம பொந்தகா
அடவி பூவுலே நீ பிரேம பொந்தகா
அடவி பூவுலே நீ பிரேம பொந்தகா
நா பிராத்தனா ஆலகின்ச்சுமா பிரbuவா
நா பிராத்தனா ஆலகின்ச்சுமா
என்னி தலச்சினா ஏதி அdigina
ஜரிகேதி நீ சித்தமே
பிரbuவா ஜரிகேதி நீ சித்தமே
MUSIC
நா இன்டி தீபம் நீ வேஅனிதலச்சி
நாக்ருதயம் நீ கொரக்கை பதிலபரச்சித்தி
INTERLODE
நா இன்டி தீபம் நீ வேஅனிதலச்சி
நாக்ருதயம் நீ கொரக்கை பதிலபரச்சித்தி
ஆரிபோயினா நா வெலுகு தீபமு
ஆரிபோயினா நா வெலுகு தீபமு
வெலிகிச்சுமு நீ பிரேமதூ பிரபுவா
வெலிகிச்சுமு நீ பிரேமதூ
என்னி தலச்சினா ஏதி அdigina
ஜரிகேதி நீ சித்தமே
பிரbuவா ஜரிகேதி நீ சித்தமே
MUSIC
ஆ பதலு நன்னு வென்னன்டி உன்னா
நா காபரி நீ வைனன்னு ஆதுகொன்டிதீ
INTERLODE
ஆ பதலு நன்னு வென்னன்டி உன்னா
நா காபரி நீ வைனன்னு ஆதுகொன்டிதீ
லோகமந்தயு நன்னு விடச்சினா
லோகமந்தயு நன்னு விடச்சினா
நீ வுந்தி வேறு சேயகு
பிரbuவா நீ வுந்தி சேயகு
என்னி தலச்சினா ஏதி அdigina
ஜரிகேதி நீ சித்தமே
பிரbuவா ஜரிகேதி நீ சித்தமே
நீ வாக்குகை வேச்சிவயுன்டினி
நா பிராத்தனா ஆலகின்ச்சுமா பிரbuவா
நா பிராத்தனா ஆலகின்ச்சுமா
Enni Thalachinaa Edi Adiginaa English Lyrics
Enni Thalachinaa Edi Adiginaa
Jarigedi Nee Chiththame (2) Prabhuvaa
Nee Vaakkukai Vechiyuntini
Naa Praarthana Aalakinchumaa (2) Prabhuvaa
Nee Thodu Leka Nee Prema Leka
Ilalona Ae Praani Niluvaledu (2)
Adavi Poovule Nee Prema Pondagaa (2)
Naa Praarthana Aalakinchumaa (2) Prabhuvaa ||Enni||
Naa Inti Deepam Neeve Ani Thelasi
Naa Hrudayam Nee Korakai Padilaparachithi (2)
Aaripoyina Naa Velugu Deepamu (2)
Veliginchumu Nee Prematho (2) Prabhuvaa ||Enni||
Aapadalu Nannu Vennantiyunnaa
Naa Kaapari Neevai Nannaadukontivi (2)
Lokamanthayoo Nannu Vidachinaa (2)
Nee Nundi Veru Cheyyavu (2) Prabhuvaa ||Enni||
Naa Sthithi Gamaninchi Nannoo Preminchi
Naa Korakai Kalvarilo Yaagamaithivi (2)
Needu Yaagame Naa Moksha Maargamu (2)
Neeyande Nithyajeevmu (2) Prabhuvaa ||Enni||
Ennithalachina Chords in English
Dm C Dm
Enni Thalachinaa Edi Adiginaa
C Dm
Jarigedi Nee Chiththame (2) Prabhuvaa
Dm C Dm
Nee Vaakkukai Vechiyuntini
A# Dm
Naa Praarthana Aalakinchumaa (2) Prabhuvaa
Dm C Dm C
Nee Thodu Leka Nee Prema Leka
A# C Dm
Ilalona Ae Praani Niluvaledu (2)
C Dm
Adavi Poovule Nee Prema Pondagaa (2)
A# Dm
Naa Praarthana Aalakinchumaa (2) Prabhuvaa ||Enni||
Dm C Dm C
Naa Inti Deepam Neeve Ani Thelasi
A# C Dm
Naa Hrudayam Nee Korakai Padilaparachithi (2)
C Dm
Aaripoyina Naa Velugu Deepamu (2)
A# Dm
Veliginchumu Nee Prematho (2) Prabhuvaa ||Enni||
Dm C Dm C
Aapadalu Nannu Vennantiyunnaa
A# C Dm
Naa Kaapari Neevai Nannaadukontivi (2)
C Dm
Lokamanthayoo Nannu Vidachinaa (2)
A# Dm
Nee Nundi Veru Cheyyavu (2) Prabhuvaa ||Enni||
Dm C Dm C
Naa Sthithi Gamaninchi Nannoo Preminchi
A# C Dm
Naa Korakai Kalvarilo Yaagamaithivi (2)
C Dm
Needu Yaagame Naa Moksha Maargamu (2)
A# Dm
Neeyande Nithyajeevmu (2) Prabhuvaa ||Enni||
Kannada Christian Lyrics
Nanagagi pranava kottavane
nanagagi maranava geddavane
nannannu nadesalu bandavane
nannanu sandhisalu baruvavane
Yesu nanage nanage
saku nanage nanage
ella kaladol nannondigiruva
yesu sakenage
1. Saitana sodhane heccidaru
nirase hondade munde hogalu
lokada aseyu eddu nintaru
jayavannu hondutta munde hogalu
2.Manusyarellaru kaibittaru
sarira nasisi hoguttiddaru
aisvaryavella alidodaru
yogyate illavendu talli bittaru
3.Hasiru hullina sthaladalle
nannannu yesu nadesuvanu
nirina balige nadesuvanu
atmana baladinda nadesuvanu
Listen to the Song and Learn Enni thalachina Song with Music
Happy Easter – Simple Traditional Wishes
Happy Easter to every one.
Easter Bible Portion in Telugu Mark 16:1-20
1 విశ్రాంతిదినము గడచిపోగానే మగ్దలేనే మరియయు యాకోబు తల్లియైన మరియయు సలోమేయు వచ్చి, ఆయనకు పూయవలెనని సుగంధద్రవ్యములు కొనిరి.
2 వారు ఆదివారమున పెందలకడ (లేచి, బయలుదేరి) సూర్యోదయమైనప్పుడు సమాధియొద్దకు వచ్చుచుండగా,
3 సమాధి ద్వారమునుండి మనకొరకు ఆ రాయి యెవడు పొర్లించునని ఒకరితో ఒకరు చెప్పుకొనుచుండిరి.
4 వారు వచ్చి కన్నులెత్తిచూడగా, రాయి పొర్లింపబడి యుండుట చూచిరి. ఆ రాయి యెంతో పెద్దది.
5 అప్పుడు వారు సమాధిలో ప్రవేశించి, తెల్లని నిలువుటంగీ ధరించు కొనియున్న యొక పడుచువాడు కుడివైపున కూర్చుండుట చూచి మిగుల కలవరపడిరి.
6 అందు కతడుకలవర పడకుడి సిలువ వేయబడిన నజరేయుడగు యేసును మీరు వెదకుచున్నారు; ఆయన లేచియున్నాడు, ఇక్కడ లేడు; వారు ఆయనను ఉంచిన స్థలము చూడుడి.
7 మీరు వెళ్లి ఆయన మీకంటె ముందుగా గలిలయలోనికి వెళ్లుచున్నా డనియు, ఆయన మీతో చెప్పినట్టు అక్కడ మీరు ఆయనను చూతురనియు ఆయన శిష్యులతోను పేతురు తోను చెప్పుడనెను.
8 వారు బయటకు వచ్చి, విస్మయము నొంది వణకుచు సమాధియొద్దనుండి పారిపోయిరి; వారు భయపడినందున ఎవనితో ఏమియు చెప్ప లేదు.
9 ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి, తాను ఏడు దయ్యములను వెళ్లగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను.
10 ఆయనతో ఉండినవారు దుఃఖపడి యేడ్చు చుండగా ఆమె వెళ్లి ఆ సంగతి వారికి తెలియ జేసెను గాని,
11 ఆయన బ్రదికియున్నాడనియు ఆమెకు కనబడె ననియు వారు విని నమ్మకపోయిరి.
12 ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచి పోవుచుండగా, ఆయన మారురూపముగలవాడై వారికి ప్రత్యక్షమాయెను.
13 వారు వెళ్లి తక్కిన వారికి ఆ సంగతి తెలియజేసిరి గాని, వారు వీరి మాటనైనను నమ్మక పోయిరి.
14 పిమ్మట పదునొకండుమంది శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై, తాను లేచిన తరువాత తన్ను చూచినవారి మాట నమ్మనందున వారి అపనమి్మక నిమిత్తమును హృదయకాఠి న్యము నిమిత్తమును వారిని గద్దించెను.
15 మరియుమీరు సర్వలోకమునకు వెళ్లి సర్వసృష్టికి సువార్తను ప్రకటించుడి.
16 నమి్మ బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును; నమ్మని వానికి శిక్ష విధింపబడును.
17 నమి్మనవారివలన ఈ సూచక క్రియలు కనబడును; ఏవనగా, నా నామమున దయ్య ములను వెళ్లగొట్టుదురు; క్రొత్త భాషలు మాటలాడు దురు,
18 పాములను ఎత్తి పట్టుకొందురు, మరణకర మైనదేది త్రాగినను అది వారికి హాని చేయదు, రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందుదురని వారితో చెప్పెను.
19 ఈలాగు ప్రభువైన యేసు వారితో మాటలాడిన తరువాత పరలోకమునకు చేర్చుకొనబడి, దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడయ్యెను.
20 వారు బయలుదేరి వాక్య మంతట ప్రకటించిరి. ప్రభువు వారికి సహకారుడై యుండి, వెనువెంట జరుగుచువచ్చిన2 సూచక క్రియలవలన వాక్యమును స్థిరపరచుచుండెను.
Easter Bible Study Verses in English Mark 16:1-20
When the Sabbath was over, Mary Magdalene, Mary the mother of James, and Salome bought spices so that they might go to anoint Jesus’ body.
2 Very early on the first day of the week, just after sunrise, they were on their way to the tomb 3 and they asked each other, “Who will roll the stone away from the entrance of the tomb?”
4 But when they looked up, they saw that the stone, which was very large, had been rolled away. 5 As they entered the tomb, they saw a young man dressed in a white robe sitting on the right side, and they were alarmed.
6 “Don’t be alarmed,” he said. “You are looking for Jesus the Nazarene, who was crucified. He has risen! He is not here. See the place where they laid him. 7 But go, tell his disciples and Peter, ‘He is going ahead of you into Galilee. There you will see him, just as he told you.’”
8 Trembling and bewildered, the women went out and fled from the tomb. They said nothing to anyone, because they were afraid.[a]
[The earliest manuscripts and some other ancient witnesses do not have verses 9–20.]
9 When Jesus rose early on the first day of the week, he appeared first to Mary Magdalene, out of whom he had driven seven demons. 10 She went and told those who had been with him and who were mourning and weeping. 11 When they heard that Jesus was alive and that she had seen him, they did not believe it.
12 Afterward Jesus appeared in a different form to two of them while they were walking in the country. 13 These returned and reported it to the rest; but they did not believe them either.
14 Later Jesus appeared to the Eleven as they were eating; he rebuked them for their lack of faith and their stubborn refusal to believe those who had seen him after he had risen.
15 He said to them, “Go into all the world and preach the gospel to all creation. 16 Whoever believes and is baptized will be saved, but whoever does not believe will be condemned. 17 And these signs will accompany those who believe: In my name they will drive out demons; they will speak in new tongues; 18 they will pick up snakes with their hands; and when they drink deadly poison, it will not hurt them at all; they will place their hands on sick people, and they will get well.”
19 After the Lord Jesus had spoken to them, he was taken up into heaven and he sat at the right hand of God. 20 Then the disciples went out and preached everywhere, and the Lord worked with them and confirmed his word by the signs that accompanied it.
Lent Day -10 Sramala Dinaalu 12/03/2022 Good Friday Images
Lent Day 10 Good God Images in Telugu:
Gospel for the Day in Telugu:
వివేకియై దేవుని వెదకువారు కలరేమో అని యెహోవా ఆకాశమునుండి చూచి నరులను పరిశీలించెను. వారందరు దారి తొలగి బొత్తిగా చెడియున్నారు. మేలు చేయువారెవరును లేరు, ఒక్కడైనను లేడు. (కీర్త 14:2,3) శరీరస్వభావము గలవారు దేవుని సంతోషపరచనేరరు. (రోమా 8:8)ఇచ్ఛ నాకు తటస్థమైయున్నది గాని, దానిని చేయుట నాకు తటస్థమగుటలేదు.నేను చేయ నిచ్చయించు మేలుచేయక యిచ్చయింపని కీడు చేయుచున్నాను. (రోమా 7:18,19)మేమందరము అపవిత్రుల వంటి వారమైతివిు. మా నీతి క్రియలన్నియు మురికిగుడ్డవలె నాయెను. మేమందరము ఆకువలె వాడిపోతివిు. గాలివాన కొట్టుకొనిపోవునట్లుగా మా దోషములు మమ్మును కొట్టుకొనిపోయెను. (యెష 64:6) యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలముగా కలిగిన వాగ్దానము విశ్వసించువారికి అనుగ్రహింపబడునట్లు, లేఖనము అందరిని పాపమునకు లోనైనవారినిగా నెంచెను. (గల3:22)దేవుడు వారి అపరాధములను వారిమీద మోపక, క్రీస్తునందు లోకమును తనతో సమాధానపరచు కొనును. (2కొరిం 5:19) మనము పాపము లేనివారమని చెప్పుకొనిన యెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్యముండదు. మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును నీతిమంతుడునై యున్నాడు
What are LENT Days – LENT Season Meaning – Telugu
శ్రమల కాలం (Lent Days)
ఈ బుధవారంతో ఉపవాసకాలం మొదలవుతుంది. ఈ శ్రమల దినములను అందరూ ఆచరిస్తూ, ఎక్కువ సమయం ప్రార్ధనలో గడుపుతూ, క్రీస్తు శ్రమలను ధ్యానిస్తూ, ఆధ్యాత్మికంగా పెరగడానికి ఈ శ్రమల కాలం ఎంతో ఉపయోగపడును. ఈ రోజు మార్చి 1 మొదలుకొని ఈస్టర్ వరకు ఏప్రిల్ 14 వరకు గల ఈ 40 దినాలనే శ్రమల కాలం అంటారు. మధ్యలో గల ఆదివారాలు లెక్కించరు. ఇవి 40రోజులే ఎందుకు అంటే బైబిల్ లో 40 కి చాలా ప్రాముఖ్యత ఉంది.
▶ నోవహు కాలములో జలప్రళయం 40 దినాలు.
▶ మోషే దైవ సన్నిధిలో గడిపినది 40 దినాలు.
▶ ఏలీయా 40 రోజులు ఉపవాసం ఉండి శక్తిని పొందుకున్నాడు.
▶ మోషే సినాయి కొండ మీద 40 రోజులు గడిపి 10 ఆజ్ఞలు పొందాడు.
▶ అరణ్య యాత్ర 40 సంవత్సరాలు.
▶ కనాను లో వేగులవారు పర్యవేక్షణ 40 దినాలు
▶ నినివే వారికీ హెచ్చరిక 40 దినాలు
▶ గోల్యాతును ఇశ్రాయేలీయులు ఎదుర్కొనినది 40 దినాలు.
▶ యేసుక్రీస్తు దేవుని పరిచర్యకు ముందు 40 దినాలు ఉపవాసం ఉన్నారు.
📝 ఇందును బట్టి క్రీ.శ. 6వ శతాబ్దములో పోప్ ది గ్రేట్ గ్రెగరి (Gregory the Great) లెంట్ కాలమును క్రమపరచెను. మన ఆచారము ప్రకారము యేసు క్రీస్తు శ్రమల కాలము తరువాత సిలువ మరణం పొందలేదు. లెంట్ డేస్ తరువాత దేవుని పరిచర్య ప్రారంభించెను.
📝 Lent అను పదము Anglo-Saxon పదమైన Leneten నుండి పుట్టినది. Leneten అను పదానికి చీల్చు, పగులగొట్టు, చిగురించుటకు ఆరంభం, వసంతకాలం అను అర్ధాలు ఉన్నాయి. లెంట్ కాలము అనగా ఉపవాస కాలము అని అర్ధముగా చెప్పుకొనుచున్నాము.
📝 ఉపవాసకాలం అనుమాట సంస్కృత పదము నుండి పుట్టినది. ఇది రెండు ధాతువుల సమ్మేళనం. ఉప+వాసము. ఉప = తగ్గి, వాసము = నివాస స్థలము అనగా తగ్గి నివసించుట లేదా పస్తుండుట.
📝 భస్మము లేక బూడిద (Ash) అనునది అగ్నినుండి గాని యజ్ఞములో దహించబడిన జంతువు నుండి మిగిలిన అవశేషము బూడిద అంటారు. అబ్రాహాము సొదొమ, గొమొఱ్ఱ పట్టణములో నుండి లోతు కుటుంబమును రక్షించుటకు ప్రభువుతో మొర విడినది బూడిదయు ధూళిననునది అంటే తగ్గింపు జీవితమునకు గుర్తు.
📝 శ్రమ దుఃఖ విషయములకు బైబిల్ లో గోనెపట్ట కట్టుకొనుట, బూడిదలో కూర్చుండుట, బూడిద రాసుకొనుట, తలపై చల్లుకొనుట మొదలగునవి గుర్తుగా చెప్పబడినవి. “ప్రతిదినము దేవాలయములో అర్పింపబడు బలుల అవశేషము ప్రతి సాయంత్రము పట్టణము నుండి బయట పారవేయబడుదురు. ఇందుకు బూడిద వేయబడు లోయ కలదు (యిర్మీయా 31:40)
గోనె పట్ట కట్టుకొనిన కొందరు:
▶ నీనివే పట్టణస్థులు (యోనా 3:6)
▶ ఆహాబు (1రాజులు 21:27)
▶ బెన్హదుదు సేవకులు (1రాజులు20:32)
▶ ఇశ్రాయేలీయుల రాజు (2రాజులు 6:36)
▶ యాకోబు (ఆది 37:34)
▶ మొర్దెకై (ఎస్తేరు 4:1)
▶ దానియేలు (దానియేలు 9:2)
📝 లెంట్ లో ఉపవాసముండుట క్రైస్తవ సంఘానికి ఒక సవాలు.ఉపవాస కాలము తరువాత విశ్వాసికి నూతనోత్తేజము, నూతన బలము కలుగును. దేవునికి సమీపస్థులగుటకు ఇది ఒక మార్గము. నెసైయా (Nestia) అను గ్రీకు పదము నుండి ఉపవాసము అను అర్ధము వచ్చును. యూదా జనాంగము సోమవారం, గురువారం ఉపవాసము ఉందురు. పరిసయుడు వారమునకు రెండు పర్యాములు ఉపవాసము ఉందురు. ఈస్టర్ పండుగకు సిద్దబాటుగా ఉపవాసము ఉండు ఆచారము సనాథనముగా ఉండునట్లు తెలియచున్నది. దీని గురించిన ప్రస్తావన ఇరేబియాస్ (Irenaesus 97-202 AD) మరియు టెర్టుల్లియన్ ( Tertullian 186-220 ) అనువారు వ్రాసిన గ్రంధములలో ఈ విషయము కనిపించును.
బైబిల్ లో ఉపవాసము ఉన్న కొందఱు:
▶ యేసుప్రభువు (మత్తయి 4:2)
▶ నెహెమ్య (నెహె 1:4)
▶ ఎస్తేరు (ఎస్తేరు 4:15-17)
▶ మొర్దెకై. (ఎస్తేరు 4:16)
▶ నీనివే వారు (యోనా 3:5-10)
▶ దావీదు (2సమూ 12:16)
▶ దానియేలు (దాని 9:3)
ఉపవాసమనగా,
ఉ = ఉపేక్షించుకొని,
ప = పరీక్షించుకొని,
వా = వాక్య,
స = సందేశముతో,
ము = ముందుకు సాగుట.
ముగింపుగా లెంట్ కాలము సార్వత్రిక క్రైస్తవ సంఘానికి ఆత్మీయతకు దోహదపడు ఉపవాసకాలముగా మనం గుర్తించుచున్నాము. ప్రభువు మానవుడై మన రక్షణకై శ్రమపడిన విధమును జ్ఞాపకము చేసుకొని ఈ ప్రత్యేక దినమును మనము జ్ఞాపకము చెసుకొనుట మనకెంతో ఆశీర్వాదము. పరలోకానికి దారి సిలువ దగ్గరినుండే మొదలవుతుంది. సిలువను నామకర్ధముగా ధ్యానిస్తే దానిలో దాగి ఉన్న యేసయ్య ప్రేమను మనం చూడలేము. మనము ఆ శ్రమలను ఉపవాసము ద్వారా నలుగగొట్టబడి ప్రార్ధనతో ధ్యానిస్తే ఆ సిలువ విజయం మనం పొందగలం. అలా ఈ ఉపవాస కాలములోనైనా దేవునికి దగ్గర కావాలని, ప్రార్ధనతో సిద్ధబడాలి అని కోరుకుంటూ……..
source: FB Bible Mission Gooty
By your blood – Lent Days Songs
By Your blood I can enter the holiest place,
To the throne of my Father and King.
There I find Your acceptance, mercy and grace,
And my life is renewed again.
Far away from the stress and the turmoil of life,
I now come to seek Your face.
In the house of the Lord where Your presence is found,
I now come to worship You.
I see the King upon the throne,
Jesus, full of majesty.
I will fall down at Your feet,
I will worship You alone.
In the light of Your presence I find deepest joy,
There is no other place I would be.
To behold Your beauty is all my desire,
You’re the one my heart longs for,
You’re the one my heart longs for.